Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: ఒబెరాయ్ హోటల్ కు అలిపిరిలో భూములు - టీటీడీ క్లారిటీ..!!

Tirumala: ఒబెరాయ్ హోటల్ గ్రూపుకు అలిపిరిలో భూ కేటాయింపు వివాదం మరో సారి తెర మీదకు వచ్చింది. దీని పైన గతంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హోటల్ కు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పుడు మరోసారి ఈ అంశం పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో.. టీటీడీ ఈ భూ కేటాయింపుల వివాదంలో తొలి నుంచి ఏం జరిగిందీ... చివరగా తీసుకున్న నిర్ణయం పైన స్పష్టత ఇచ్చింది. వస్తున్న ఆరోపణల ను టీటీడీ ఖండించింది.

ఒబెరాయ్ హోటల్ గ్రూపుకు భూముల కేటాయింపుల పైన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీటీ ఖండించింది. గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన స్వామి పాదాల చెంతన అలిపిరి లో వున్న పవిత్రమైన ఆ భూమిలో టూరిజం శాఖ 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినట్లు గుర్తు చేసింది.

TTD has condemned the allegations by Bhumana Karunakar Reddy as incorrect

కాగా, ఎప్పుడైతే సదరు భూమిని టూరిజం శాఖ ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినట్లు తెలిసిందో అప్పటి నుండి హిందూ సంఘాలు, స్వామీజీలు, భక్తులు, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేసారని వివరించింది. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 18వ తేది జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 102 ప్రకారం ఆ పవిత్రమైన భూమి ఒబెరాయ్ హోటల్ కు చెందకుండా టీటీడీకి కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు.

అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది మార్చి 21వ తేదిన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా ఏడు కొండలకు ఆనుకుని ఉన్న పవిత్ర ప్రదేశంలో ఎలాంటి అపవిత్ర కార్యాకలాపాలకు వీలు లేకుండా చేస్తామని చెప్పారని వివరించింది. ఈ క్రమంలో ఉత్తరం వైపు స్వామి పాదాల చెంత ఆనుకుని ఉన్న భూమిని టీటీడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ సదరు భూమికి బదులుగా రోడ్ కు అవతల వైపు భూమి ని కేటాయించాలని టూరిజం శాఖ కోరినట్లు పేర్కొంది. దీనిపై 2025 మే 7వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 250 ప్రకారం భూ బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ టీటీడీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించింది.

ttd-has-condemned-the-allegations-by-bhumana-karunakar-reddy-as-incorrect

ఈ క్రమంలో అలిపిరిలోని స్వామి పాదాల చెంత ఉన్న టూరిజం భూమిని టీటీడీకి , అదేవిధంగా రోడ్డుకు దక్షిణం వైపుగా ఉన్న టీటీడీ భూమిని టూరిజం శాఖకు బదలాయించేందుకు 2025 జూలై 22వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 385 ప్రకారం ఆమోదం తెలిపినట్లు వివరించింది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో రోడ్డుకు ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని భక్తుల సౌకర్యాల కల్పన నిమిత్తం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు వివరించింది.

అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో దక్షిణం వైపు ఇప్పటికే పలు నిర్మాణాలు జరిగాయని పేర్కొంది. ఈ కారణంగా దక్షిణం వైపు ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించి, తిరుమల కొండకు ఆనుకుని ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని టీటీడీ తీసుకోవడం జరిగిందని స్పష్టం చేసింది. తిరుమల పవిత్రత, భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి కీలకమైనదిగా స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+