"మీరు క్రిస్టియన్.. కాదు నేను హిందువు": మండలిలో మతాల రచ్చ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 'తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ' అంశం చిచ్చురేపింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో సభ రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 పేజీల నివేదికలోని అంశాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే, మరోవైపు మండలి ఛైర్మన్ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సాక్షిగా 'తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ' వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించింది. భక్తికి ప్రతిరూపమైన లడ్డూ ప్రసాదం చుట్టూ అల్లుకున్న అవినీతి ఉచ్చును ప్రభుత్వం ఆధారాలతో సహా సభ ముందు ఉంచడంతో వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, వ్యక్తిగత విమర్శలు, చివరికి క్షమాపణలతో మండలిలో గంటల తరబడి హై-టెన్షన్ డ్రామా కొనసాగింది. లడ్డూ కల్తీ అంశంపై చర్చకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అనుమతించడంతో, ఈ వివాదంపై ప్రభుత్వం తన వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగించింది.

చర్చ ప్రారంభానికి ముందే ప్రభుత్వం సభ్యులందరికీ పంపిణీ చేసిన 20 పేజీల సమగ్ర నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. 2014-19 మధ్య ఉన్న కఠినమైన టెండర్ నిబంధనలను, 2020లో అప్పటి టీటీడీ బోర్డు ఏ విధంగా సడలించిందో ప్రభుత్వం తేదీలతో సహా వివరించింది. ముఖ్యంగా నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న పాత్రపై ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. నెయ్యి సరఫరాదారులను బెదిరించి, వారు దారికి రాకపోతే తనిఖీల పేరుతో లొంగదీసుకుని సుమారు రూ.4.69 కోట్లు లంచంగా వసూలు చేసినట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న డెయిరీ నిపుణులు, కల్తీకి సహకరించిన సంస్థల ఉద్యోగులు ఇప్పటికే తమ నేరాన్ని అంగీకరించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
హిందూ ధర్మం అంటే గౌరవం లేదు..
అయితే, ఈ చర్చలో వైసీపీకి మద్దతుగా స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడిన మాటలు సభలో మంటలు రేపాయి. లడ్డూ కల్తీ అంశాన్ని పక్కన పెట్టి, ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని 'హెరిటేజ్' సంస్థ ప్రస్తావన తీసుకురావడంతో మంత్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందిస్తూ.. హెరిటేజ్ సంస్థ ఎప్పుడో ప్రభుత్వానికి సరఫరా చేయకూడదని నిర్ణయించుకుందని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవిత్రమైన తిరుమల ప్రసాదంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే "మీకు, మీ నాయకుడికి హిందూ ధర్మం అంటే గౌరవం లేదు" అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
మీరూ క్రిస్టియనే..
సభలో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మండలి ఛైర్మన్ను ఉద్దేశించి "మీరూ క్రిస్టియనే" అని అనడం వివాదాస్పదమైంది. దీనిపై ఛైర్మన్ మోషేన్ రాజు తీవ్రంగా స్పందిస్తూ, తాను క్రిస్టియన్ కాదని, హిందువునని స్పష్టం చేశారు. ఛైర్మన్ సమాధానంతో అచ్చెన్నాయుడు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. "నేను భేషజాలకు పోను, పొరపాటున మిమ్మల్ని క్రిస్టియన్ అనుకున్నాను.. నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను, తప్పు ఒప్పుకుంటున్నాను" అని సభలోనే క్షమాపణ కోరారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు శాంతించకుండా స్పీకర్ పోడియం వద్ద నిరసనలకు దిగడంతో మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్యే ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
బ్రేకింగ్ న్యూస్
— Rahul (@2024YCP) March 4, 2026
అచ్చెన్నాయుడు పై ఛైర్మన్ మోషన్ రాజు ఆగ్రహం
క్రిస్టియన్ అని ఎవరిని అంటున్నారు
నేను క్రిస్టియన్ కాదు హిందువునే
-ఛైర్మన్ మోషన్ రాజు pic.twitter.com/yDhVWOkDya
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications