తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు, డేట్, టైమ్ ఇదే, పక్కా సమాచారం !
తిరుమల/తిరుపతి: తిరుమలలోని కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు. తిరుమల బ్రహోత్సవాల సందర్బంగా ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటారని, వాహనాల్లో, కాలినడక భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
అందుకు తగ్గట్లుగానే తిరుమలలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 17వ తేదీన బ్రహోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయని శనివారం టీటీడీ అధికారులు పూర్తి సమాచారం ఇచ్చారు.తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు అదిరిపోయే రీతిలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
* 17వ తేదీ ఆదివారం బ్రహోత్సవాలకు అంకురార్పణ. రాత్రి 7 నుండి 8 గంటల వరకు జరుగుతుంది.
*18వ తేదీ సోమవారం బంగారు తిరుచ్చి ఉత్సవం, మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.
ధ్వజారోహణం(మీన లగ్నం), సాయంత్రం 6.15 గంటల నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం, రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతుంది.
*19వ తేదీ మంగళవారం చిన్నశేష వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం - మధ్యాహ్నం 1గంట నుండి 3 గంటల వరకు.
హంస వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.
*20వ తేదీ బుధవారం సింహ వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు.
ముత్యపుపందిరి వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది.
* 21వ తేదీ గురువారం కల్పవృక్ష వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.
* 22వ తేదీ శుక్రవారం మోహినీ అవతారం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు..
* 23వ తేదీ శనివారం హనుమంత వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్వర్ణరథం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు.
గజ వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది.

* 24వ తేదీ ఆదివారం సూర్యప్రభ వాహనం, ఉదయం 8 గంటల నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు.
చంద్రప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది.
* 25వ తేదీ సోమవారం రథోత్సవం, ఉదయం 6.55 గంటలకు.
అశ్వ వాహనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు.
* 26వ తేదీ మంగళవారం పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు.ధ్వజావరోహణం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తామని శనివారం టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల సందర్బంగా ఇప్పటి నుంచి తిరుమలలో అన్ని ఏర్పాట్లు చకచకా జరగుతున్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications