ఆటోలో ఎక్కి మాటల్లో పెట్టారు: దిగాక చూసుకుంటే?, లబోదిబోమన్న మహిళ..
విశాఖపట్నం: ఓ మహిళను మాటల్లో పెట్టి.. ఆమె వద్ద నుంచి సుమారు రూ.10లక్షల విలువ చేసే ఆభరణాలతో పరారయ్యారు ఇద్దరు కి'లేడీ'లు. ప్రహ్లాదపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలోనే నగలు చోరీకి గురైనట్టు బాధితురాలు వెల్లడించారు.

పెళ్లికని వెళ్తే..:
పట్నాల కళావతి (52)-బాలవీరబ్రహ్మనంద దంపతులు హైదారాబాద్లోని లింగంపల్లిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఇటీవల కళావతి సోదరి కుమారుడికి పెళ్లి నిశ్చయమవడంతో.. పెళ్లి కోసం ప్రహ్లాదపురం వెళ్లారు. పెళ్లికని వెళ్లిన ఆమెకు చోరీ రూపంలో ఊహించని షాక్ తగిలింది.

బంగారం లాకరులో పెట్టాలనుకుంది..:
ఈ నెల 3న పెళ్లి జరగ్గా.. వివాహానంతరం కళావతి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చేశారు. కళావతి మాత్రం బాలాజీనగర్ లోని బంధువుల ఇంట్లోనే ఉండిపోయారు. వెంట తెచ్చుకున్న బంగారు ఆభరణాలను పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లాకరులో భ్రదపరుచుకుని వెళ్దామనుకున్నారు.

కిలేడీల పనేనా?:
సోమవారం మధ్యాహ్నాం బంగారు ఆభరణాలు తీసుకుని కళావతి ఆంధ్రాబ్యాంక్ బయలుదేరారు. ఆటోలో వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మరో ఇద్దరు మహిళలు కూడా అందులో ఎక్కారు.
కళావతిని మాటల్లో పెట్టిన ఆ ఇద్దరు ఆమెకు తెలియకుండా బంగారం చోరీ చేశారు. కళావతి ఆటో దిగాక చూసుకుంటే బంగారం కనిపించలేదు. ఆ ఇద్దరు మహిళలు మధ్యలోనే దిగిపోవడంతో వారి పైనే అనుమానం కలిగింది.

35తులాలు చోరీ..:
కళావతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గోపాలపట్నం బీఆర్టీఎస్ రహదారిలోని మేదరివీధి సమీపంలో ఆ ఇద్దరు ఆటో దిగారని, అప్పటివరకు ఎన్ఏడీ కొత్తరోడ్డు వరకు వస్తామన్నవారు కాస్త మధ్యలోనే దిగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 35తులాల బంగారం చోరీ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం దీనిపై గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications