గుడ్ న్యూస్ చెప్పిన యూఏఈ.. ఏపీలో పెట్టుబడుల జోరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చారిత్రక అడుగులు వేస్తున్నారు. యూఏఈలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్లో తొలిరోజు పర్యటించిన ఆయన, అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి ఏపీకి భారీ పెట్టుబడులకు సానుకూల స్పందన రాబట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ సమావేశమయ్యారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీకి ఉన్న అద్భుతమైన వరం అని వివరించిన సీఎం, పోర్టులు, ఎయిర్పోర్టులు, రైలు కనెక్టివిటీ ఉండేలా బహుళ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.ముఖ్యంగా దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మించే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్లు వివరించారు.దీనికి సానుకూలంగా స్పందించిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, ఏపీలో షిప్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలకమవుతుంది.
వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలిల్తో భేటీ అయ్యారు. అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న బుర్జిల్ సంస్థ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపింది.
తిరుపతిలో అత్యాధునిక స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రీసెర్చ్, ఎడ్యుకేషన్పై తమ సంస్థకు ఉన్న విశేష అనుభవాన్ని రాష్ట్రంలో వినియోగిస్తామని బుర్జిల్ ప్రతినిధులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రివెంటివ్-క్యూరేటీవ్ వైద్య విధానం, హెల్త్ కార్డుల డిజిటలీకరణ వంటి ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ సహా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా పోర్టులు, వైద్యారోగ్యం వంటి కీలక రంగాల్లో ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు దక్కుతుండటం రాష్ట్ర ప్రగతికి శుభసూచకంగా కూటమి నేతలు చెబుతున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications