'చనిపోయింది వైయస్ఆర్ కాదు, పోలవరం ప్రాజెక్టు'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. పట్టిసీమ ప్రాజెక్టు 'ఉభయ భ్రస్టు ప్రాజెక్టు' అని మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
2009లో చనిపోయింది వైయస్ రాజశేఖరరెడ్డి కాదని, పోలవరం ప్రాజెక్టు అని ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వైయస్ఆర్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు.
పట్టిసీమను పట్టుకుంటే పోలవరం ప్రాజెక్టును మరచిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే పట్టిసీమను నిలిపివేసి ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.
Comments
undavalli arun kumar ysr polavaram project andhra pradesh rajahmundry ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి
English summary
Ex MP Undavalli Arun Kumar Sensational Comments On YS Rajasekhara Reddy.
Story first published: Tuesday, March 10, 2015, 15:40 [IST]