టి వచ్చినట్లే, జగన్కి తెలియట్లే: ఉండవల్లి, పొన్నం సెటైర్

మేమిచ్చిన రాజ్యాంగం చదవాలి: పొన్నం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం తెలియకుంటే తాము పంపించిన రాజ్యాంగ పుస్తకాన్ని చదవాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోరడం అవివేకమన్నారు. తెలంగాణ బిల్లు పైన అసలు కుట్రదారులు జగన్ పార్టీయే అని ఆరోపించారు. బిల్లు పైన చర్చ జరగాలని, లేకుంటే సీమాంధ్ర ప్రజలకే నష్టమన్నారు.
కుట్రలను ఎదుర్కొంటాం: శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే కుట్రను తాము ఎదుర్కొంటామని శ్రీధర్ బాబు అన్నారు. బిల్లు సవరణలపై స్పీకర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లు పైన అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, ఓటింగ్ కుదరదన్నారు. సవరణలపై స్పీకర్కు తాము లేఖ రాశామన్నారు.
తెలంగాణలో పర్యటింటాలని టిటిడిపి నిర్ణయం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జెఏసితో వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు. వారు మంగళవారం టిడిఎల్పీలో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తెలంగాణలో పర్యటించి పార్టీ వైఖరిని ప్రజలకు వివరించాలని, గతంలో ఐకాసతో వెళ్లి తప్పు చేశామని, ఇప్పుడు సొంతగా వెళ్దామని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications