కేంద్ర బడ్జెట్: అమరావతికి భూములిచ్చిన 24 వేల మందికి వరం
ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తున్నామని కొంతలో కొంత ఊరట కలిగించే మాటలు మాట్లాడింది. ఈ నేపథ్యంలో అందరి చూపు జైట్లీ కేంద్ర బడ్జెట్ పైన ఉంది.
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి మొండిచేయి చూపింది. అంతకుమించి ప్యాకేజీ ఇస్తున్నామని కొంతలో కొంత ఊరట కలిగించే మాటలు మాట్లాడింది. అమరావతికి భూముల ఇచ్చిన రైతులకు మాత్రం వరం ప్రసాదించింది

అమరావతి ప్రాంతంలో ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం అత్యంత వినూత్నంగా భూసమీకరణ జరిగిందని ఆయన ప్రశంసించారు. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
భూసమీకరణలో తమ పొలాలను ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెట్టకు ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 250 గజాలు వాణిజ్య ప్లాటు చొప్పున కేటాయించింది. అదే జరీబు భూములు ఇచ్చిన వారికి వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తోంది. రాజధాని రాకతో స్థలాల విలువ భారీగా పెరుగుతుందని, తమ వాటా ప్లాట్లు విక్రయించుకోవడం ద్వారా రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్లాట్ల తొలిసారి విక్రయం (ఫస్ట్ సేల్) ద్వారా వచ్చిన డబ్బుపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయించాలని రాజధాని రైతులు మొదటి నుంచి కోరుతున్న విషయాన్ని గత ఏడాది అక్టోబరులో అమరావతి పరిపాలనా నగరం, 7 కీలక రహదారుల శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించేందుకు రాజధాని ప్రాంతానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలియజేశారు.
వారి వాదనను శ్రద్ధగా విన్న జైట్లీ... ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను ఢిల్లీకి వెళ్లగానే ఈ ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కాగా, క్యాపిటల్ గెయిన్స్పై పన్ను మినహాయించాలంటే ప్రత్యేకంగా చట్టం తేవాల్సి ఉంటుందని కూడా అప్పట్లో జైట్లీ చెప్పారు. అయితే, కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో, క్యాపిటల్ గెయిన్స్పై పన్ను మినహాయింపును బడ్జెట్లో పెట్టారు.
ఈ క్యాపిటల్ గెయిన్ మినహాయింపు వల్ల 24 వేల మంది రైతులు ప్రయోజనం పొందుతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications