తెలంగాణపై మాట మార్చినందుకే: విజయమ్మపై ఉత్తమ్
వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా వైయస్ విజయమ్మను గౌరవిస్తామని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ పర్యటన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా వైయస్సార్ కాంగ్రెసు ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని ఆయన అన్నారు.
వైయస్ కుటుంబమే దోచుకుంది..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, వైయస్ విజయమ్మ ముఖాలు చూడడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు అన్నారు. తెలంగాణను కొల్లగొట్టింది వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమేనని ఆయన ఆరోపించారు. వైయస్ చేసిన ద్రోహాన్ని చూసేందుకు విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తారా, వేయి మంది త్యాగాలకన్నా కుమారుడి సుఖమే ముఖ్యమా అని ఆయన అడిగారు.
వైయస్సార్ కాంగ్రెసు మోసాలకు డిక్షనరీలో పదాలు దొరకడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ఆదరబాదరగా నిధులు తరలించుకుని పోతున్నారని ఆయన విమర్సించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు విషయమై తెలంగాణ మంత్రులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.