విమర్శల ఎఫెక్ట్: టీటీడీ బోర్డు నుంచి వంగలపూడి అనిత తొలగింపు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి విశాఖపట్నం పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె క్రైస్తవురాలు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
అందుకు ఆమె చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోను హల్చల్ సృష్టించింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా ఇటీవల చోటు దక్కించుకున్నారు. విమర్శలు రావడంతో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ పాలక వర్గం సభ్యురాలిగా తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆమెను తొలగించారు.
తాను క్రైస్తవురాలిని అని, తన హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రభుత్వం టీటీడీలో క్రైస్తవులకు చోటు కల్పిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
-
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications