వంగవీటి రంగా కుమార్తె ఆ పార్టీలోకి ఎంట్రీ ఫిక్స్..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల్లో చేరికల కాలం మళ్లీ మొదలైంది. డీలిమిటేషన్ వచ్చే ఎన్నికల లోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్న వేళ ఏపీలో కూటమి పార్టీల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీ లో ఎంట్రీ ఇస్తున్న వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సమయంలో వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయంగా ఎంట్రీ ఇవ్వటం పైన చర్చ జరుగుతోంది. చేరే పార్టీ దాదాపు ఖరారైందని తెలుస్తోంది.
విజయవాడ కేంద్రం గా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వంగవీటి రాధా టీడీపీ లో కొనసాగుతున్నారు. ఏ పదవి ఇప్పటి వరకు దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెబుతున్నా.. ఈ సారి దక్కటం పైన స్పష్టత లేదు. ఇదే సమయంలో వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ కొంత కాలంగా జనంలో ఉంటున్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయటమే తన లక్ష్యమని పదే పదే చెబుతున్నారు. అయితే, వచ్చే ఎన్నిక నాటికి పార్టీలో చేరటం అవసరమని గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీలో చేరుతారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఆశా కిరణ్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు . ప్రస్తుతం ఆమె 'రాధా-రంగా మిత్రమండలి'ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

జనసేనలో చేరుతారని ప్రచారం
ఇదే సమయంలో ఆశా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వం ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని మరియు కృష్ణా నది ఒడ్డున రంగా ఘాట్ ను నిర్మించాలని ప్రత్యేకంగా కోరారు. ఈ రెండు డిమాండ్లతో తాను తొందరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలుస్తాను అని ఆశా కిరణ్ చెప్పారు. పవన్ ఈ డిమాండ్లను పరిష్కరిస్తారు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చూస్తే గత ఏడాది డిసెంబర్ 26న రంగానాడుని విశాఖలో నిర్వహించిన ఆశాకిరణ్ రాజకీయంగా ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారు అన్నది చర్చగా ఉంది. పవన్ తో ఆశాకిరణ్ భేటీ అవుతారు అన్న వార్తలతో ఆమె చూపు జనసేన వైపు ఉందా అన్న కొత్త చర్చ కూడా తెర మీదకు వస్తోంది. 2029 ఎన్నికల లోగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అటు కేంద్ర పక్కాగా అడుగులు వేస్తోంది. డీలిమిటేషన్ జరిగితే ఏపీలో భారీగా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో.. ఈ రెండు నిర్ణయాల అమలు దిశగా పార్టీల్లో చేరటం కోసం పలువురు వేచి చూస్తున్నారు.













Click it and Unblock the Notifications