మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాం: వట్టి వసంత్ కుమార్, బాబు దీక్షపై రఘువీరా
అమరావతి: మెగా ఫ్యామిలికీ తాము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శుక్రవారం అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తోందని, హోదాపై కాంగ్రెస్ నిబద్ధతను ఏపీ ప్రజలు హర్షిస్తున్నారని మాజీ ఎంపీ జేడీ శీలం వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి దీక్షపై రఘువీరా సెటైర్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్షపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లుగా బీజేపీకి టీడీపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు.

ఇపుడు ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కాంగ్రెస్అ ధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికల దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు.
దీక్ష పేరుతో కోట్ల నిధులు దుర్వియోగం అవుతున్నాయని రఘువీరా విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైలులో పెట్టారని, ఇప్పుడు హోదా కోసం మళ్లీ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో దళితులకు, మహిళలకు రక్షణ లేదన్నారు. కర్నాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు.
-
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..? -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
నాగ చైతన్య - రష్మిక కు అవార్డులు, దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications