కాంగ్రెస్పై వెంకయ్య ఫైర్: నాగం వాహనంపై రాళ్ల దాడి
హైదరాబాద్/మహబూబ్నగర్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా లేదంటున్న కాంగ్రెస్, ఎందుకు భయపడుతోందని బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలనకు, అభివృద్ధికి సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ పార్టీ బిజెపిపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ బాధ్యత లేకుండానే అధికారం అనుభవించారని ఆరోపించారు.
కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందని వెంకయ్య నాయుడు చెప్పారు. నరేంద్ర మోడీ ధీటైనా నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ పోటీ పడలేకపోతోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే దృఢమైన నిర్ణయాలు సాధ్యమవుతాయని చెప్పారు. ఎన్డీఏతోనే స్థిరమైన ప్రభుత్వం సాధ్యమవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. మోడీ హవా లేదంటూనే.. కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అవాస్తవమైన, వ్యక్తిగత ఆరోపణలకు దిగుతోందని అన్నారు.

నాగం వాహనంపై రాళ్ల దాడి
మహబూబ్నగర్: జిల్లాలోని మక్తల్లో బిజెపి ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి జరిగింది. తమ నాయకులకు ఎన్నికల్లో సీటు రాకుండా చేశారని ఆరోపిస్తూ పలువురు పార్టీ కార్యకర్తలు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి సర్దిచెప్పాలని ప్రయత్నించినప్పటికీ ఆ చర్యలు ఫలించలేదు.
బిజెపి, తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా మక్తల్ స్థానాన్ని టిడిపికి ఇచ్చినందుకు మనస్థాపంతో బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు కొండయ్య ప్రకటించారు. మక్తల్ అసెంబ్లీ స్థానానికి వేసిన నామినేషన్ను కొండయ్య శనివారం ఉపసంహరించుకున్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న కొండయ్యను బుజ్జగించేందుకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డిని కొండయ్య వర్గీయులు అడ్డుకున్నారు. నాగం వాహనంపై రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications