తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వు..
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ను ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్సింగ్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలానే జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు.

కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్నారు. ఇది అసమానత అని.. రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తేడా చేయకూడదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం 2026 తర్వాత విడుదలయ్యే జనాభా లెక్కలు రావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు" అని వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 82లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని కేంద్రం స్పష్టం చేసింది.
జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే అసెంబ్లీ సీట్లను పెంచగలమని తేల్చిచెప్పింది. ఇక జమ్మూకశ్మీర్ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం చట్టపరమైనదే అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సూర్యకాంత్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
-
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications