మొదట సుజననే పెట్టారు!: మోడీ కాళ్లకు నమస్కారంపై విజయసాయి, తోక ఛానల్స్
Recommended Video

అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తనను పదేపదే టార్గెట్ చేసుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎవరైతే తల్లిదండ్రులకు పుడతారో అలాంటి వారు తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయరని ఘాటుగా మాట్లాడారు. అదే సమయంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కారన్న వ్యాఖ్యల పైన కూడా స్పందించారు. టీడీపీని కడిగిపారేశారు.

చంద్రబాబు ఎదురుపడితే నమస్కరిస్తా
తాను చంద్రబాబును ఓ వ్యక్తిగా కాకుండా, ఏపీ ముఖ్యమంత్రిగా చూస్తానని, ఆయన ఎదురుపడ్డా నమస్కరిస్తానని విజయ సాయి రెడ్డి అన్నారు. నమస్కారం చేస్తే ప్రతినమస్కారం పెట్టే సంస్కృతి మనది అన్నారు. చంద్రబాబుకు మాత్రం ఆ సంస్కారం లేదన్నారు. తనకు బద్ద వ్యతిరేకి అయినప్పటికీ చంద్రబాబు కనిపిస్తే సీఎం కాబట్టి నమస్కరిస్తానని చెప్పారు.

సుజనా చౌదరి మొదట మోడీకి నమస్కరించారు
అదే సమయంలో రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లకు నమస్కారంపై విజయ సాయి రెడ్డి స్పందిస్తూ.. అసలు తనకంటే ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వెళ్లి మోడీకి నమస్కరించారని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. తమ పార్టీ భారతీయ సంస్కృతిని బాగా నమ్మే పార్టీ అన్నారు.

చంద్రబాబు తోక ఛానల్స్ కుట్ర
ఆ తర్వాత తనకు కూడా ప్రధాని మోడీ ఎదురుపడ్డారని, తాను నమస్కరించానని విజయ సాయి రెడ్డి చెప్పారు. కులాసాగా ఉన్నారా అని అడిగారని చెప్పారు. వారు కూడా పెట్టారని, కానీ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు తోక పార్టీలు, తోక ఛానల్స్ ఈ కుట్రలు చేశాయన్నారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కృతి చంద్రబాబు ఒక్కడికే లేదన్నారు.

వారి విజ్ఞతకే వదిలేస్తున్నా
చంద్రబాబు కుసంస్కారి కాబట్టి తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారని విజయ సాయి రెడ్డి విమర్శించారు. తాను పాదాభివనందనం చేసినట్లుగా వచ్చి నవార్తలపై వివరణ ఇచ్చారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కాగా, విజయసాయి రెడ్డి నమస్కరించగా, మోడీ ప్రతి నమస్కారం చేశారు. ఆ తర్వాత విజయ సాయి రెడ్డి మోడీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. మోడీ ఆయనను ఆశీర్వదిస్తూ భుజంపై చెయ్యి వేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications