సాయిరెడ్డి సంచలన డిమాండ్, టార్గెట్ ఫిక్స్..!!
వైసీపీ మాజీ ముఖ్య నేత సాయి రెడ్డి సంచలన డిమాండ్ చేసారు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటిస్తూ సాయిరెడ్డి వైసీపీ వీడారు. అయితే, సాయిరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కొద్ది రోజుల క్రితం సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతారనే విశ్లేషణలు మొదలయ్యాయి. జగన్ కోటరీ గురించి మరోసారి వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ గురించి ఆసక్తికర అంశాలు చెప్పారు. ఇప్పుడు సాయిరెడ్డి కొత్త డిమాండ్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి కొత్త అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీలో కీలకంగా పని చేసిన సాయి రెడ్డి 2024 ఎన్నికల తరువాత పార్టీని వీడారు. జగన్ కోటరీ కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. ఆ తరువాత కాకినాడ పోర్టు, లిక్కర్ కేసుల్లో సాయిరెడ్డి వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి. కాగా.. తాజాగా సాయిరెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మరోసారి జగన్ కోటరీ గురించి తన వాదన వినిపించారు. పవన్ తో ఉన్న స్నేహం గురించి ప్రస్తావన చేసారు. తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని.. రాజకీయంగా తన భవిష్యత్ పైన ఆయన చేసిన విశ్లేషణ కొత్త చర్చకు కారణమైంది. కాగా.. ఇప్పుడు సాయిరెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ మతం ప్రస్తావన చేస్తూ ట్వీట్ చేసారు. ఇదే అంశం పైన ప్రభుత్వం ముందు తన డిమాండ్ ఉంచారు.

సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ లో.. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. డబ్బు ఆశ చూపి.. మతం మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి.. గుణపాఠం నేర్పిద్దామని ఆయన పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష ..శ్రీరామ రక్ష అని తెలిపారు. దీంతో, సాయిరెడ్డి ఇప్పుడు హిందూ మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చకు తెర తీసింది. జాతీయ పార్టీలో చేరే ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే.. సాయిరెడ్డి భవిష్యత్ అడుగులు ఏంటనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications