వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆనందంలో విజయమ్మ నిజాలు: రాజేంద్ర ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajendra Prasad
హైదరాబాద్: తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చాడన్న ఆనందంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నిజాలు దాచలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఎద్దేవా చేశారు.

సిడబ్ల్యూసి విభజన నిర్ణయం ముందే తెలిసి తమ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించామని విజయమ్మ చెప్పారని విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల రాజకీయ జీవితాల అంతిమయాత్రకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాట్లు చేశారన్నారు.

జగన్ పార్టీ, కాంగ్రెసుల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. విభజన విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వైయస్ విజయమ్మ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూటకోమాట మాట్లాడుతోందన్నారు. పూటకో మాట మాటలాడుతూ ఫోర్జరీ, చీటింగ్ చెక్కులు ఇస్తోంది ఆ పార్టీయే అన్నారు. విజయమ్మ ఢిల్లీ వెళ్లినా కాంగ్రెసు పెద్దలను విమర్శించడం లేదని అందుకు ఆ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కారణమన్నారు.

English summary
Telugudesam Party senior leader Rajendra Prasad on Friday said YSRCP honorary president YS Vijayamma is revealing facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X