విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

viral video:అశోక్ సారు కొట్టలేదు -మంటల నుంచి కాపాడారు -టీడీపీ మహిళా కార్యకర్త వివరణ

|
Google Oneindia TeluguNews

విజయనగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఓ మహిళపై చేయిచేసుకున్నారనే ఘటనలో అసలు విషయం బయటికొచ్చింది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం, ఆయన కేంద్ర మాజీ మంత్రి కూడా కావడంతో ఈ ఘటనకు జాతీయ మీడియా సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. గడిచిన కొద్ది గంటలుగా 'మహిళపై అశోక్ జగపతి రాజు దాడి' వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, అక్కడ అసలేం జరిగిందో బాధిత మహిళ వివరణతో కూడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది..

'అంబానీ బాంబు' కేసుపై మరో బాంబు -ఏదో కుట్ర దాగుందన్న మహా సీఎం -ఎన్ఐఏ దర్యాప్తుపై అనుమానం'అంబానీ బాంబు' కేసుపై మరో బాంబు -ఏదో కుట్ర దాగుందన్న మహా సీఎం -ఎన్ఐఏ దర్యాప్తుపై అనుమానం

 బాలయ్య ఎఫెక్ట్‌తో..

బాలయ్య ఎఫెక్ట్‌తో..

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు విజయనగరంలో సోమవారం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమాన నేత వచ్చారని గౌరవంతో ఓ మహిళ పువ్వులు చల్లి, హారతి ఇచ్చేందుకు ప్రయత్నించగా, సహనం కోల్పోయిన గజపతిరాజు ఆ మహిళా కార్యకర్తను మెడలు వంచి కొట్టారంటూ ప్రచారం జరిగింది. రెండు రోజుల కిందట టీడీపీకే చెందిన నటుడు బాలకృష్ణ హిందూపురంలో ఓ అభిమానిని చెంపదెబ్బ కొట్టడం, దానికి పులకించిపోయానని బాధితుడు చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఆ నేపథ్యంలో నేటి అశోక్ గజపతి ఘటనపైనా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కానీ..

మహిళా కార్యకర్త హేమలత క్లారిటీ

మహిళా కార్యకర్త హేమలత క్లారిటీ

అశోక్ గజపతిరాజుతో చెంపదెబ్బ తిన్నట్టుగా ప్రచారం జరిగిన టీడీపీ మహిళా కార్యకర్త హేమలత చెప్పిన విషయం వేరేలా వుంది. ఈ ఘటనపై ఆమె క్లారిటీతో కూడిన వీడియో కూడా మరోటి వచ్చింది. అశోక్ గజపతిరాజు చేయి చేసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని, తనకు ఆయన తండ్రి సమానులని హేమలత చెప్పారు. అభిమానంతో పదే పదే పూలు చల్లానని, అలా వద్దని వారించటానికి తన చేతిలో ఉన్న ప్లేటుపై అశోక్‌గజపతిరాజు కొట్టారని తెలిపారు. నిజానికి..

మంటల నుంచి కాపాడారు..

ప్రచారం సందర్భంగా తాను హారతి పళ్లెం పట్టుకుని నడుస్తున్నానని, నేత రాక సందర్భంగా పూలు చల్లగా, అవి హారతి పళ్లెంలో పడి మంటలు చెలరేగాయని, దాంతో అశోక్ గజపతిరాజు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారని టీడీపీ మహిళా కార్యకర్త హేమలత వివరించారు. అశోక్ గజపతిరాజు సకాలంలో స్పందించకపోయుంటే తన చీరకు మంటలు అంటుకునేవని తెలిపారు. వాస్తవం ఇదైతే ఈ ఘటనను కొంత మంది రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్నారని హేమలత తప్పుబట్టారు.

ప్రజలు నపుంసకులు -ఏపీలో మగాళ్లు లేరు -రఘుగాడినే వేశామన్నది జగన్ లెక్క: వైసీపీ ఎంపీ అనూహ్యంప్రజలు నపుంసకులు -ఏపీలో మగాళ్లు లేరు -రఘుగాడినే వేశామన్నది జగన్ లెక్క: వైసీపీ ఎంపీ అనూహ్యం

English summary
TDP Woman Activist Gives Clarity about Ashok Gajapathi Raju Slapping Video, witch gone viral on international womens day i.e march 8th. later the woman says that farmer union minister did not slapped her. amid ap Municipal elections Ashok Gajapathi Raju campaigned in Vizianagaram on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X