ఎంజాయ్ చేసేందుకు రాత్రిపూట బైక్ల చోరీ (ఫోటోలు)
విశాఖపట్నం: రైడింగ్పై ఉన్న మక్కువ, అందులోను మజాను ఎంజాయ్ చేయాలన్న కోరికతో ఓ 17 ఏళ్ల బాలుడు దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసులకు చిక్కాడు. సోమవారం ఉదయం మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఏడీసీపీ వరదరాజులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్ణా మార్కెట్ దుర్గాలమ్మ గుడి వెనుక ప్రాంతానికి చెందిన బాలుడు 2014లో జాయ్ రైడింగ్ కోసం బైక్ దొంగతనం చేసిన పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిని జువైనల్ హోంకు తరలించారు. తరిగి వచ్చినా తీరు మార్చుకోకుండా ఇళ్లలో చోరీలకు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
గతంలో మూడు, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇతను సీతం పేట వద్ద అనుమానాస్పదంగా బైక్పై తిరుగుతుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 35.9 గ్రాముల బంగారం, 83 గ్రాములు వెండి, 8 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ చేసిన వాహనాలు చోరీ చేసి రాత్రిపూట జల్సాగా తిరిగడం ఇతనికి అలవాటని పోలీసులు తెలిపారు.