విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం... తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు,స్థానికులు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఏకమై విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని కార్మికులు చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆదేశాలతో విశాఖ వెళ్లి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మనకెందుకులే అని వదిలేస్తే... రేపు మన దాకా వస్తుందన్నారు. తెలంగాణలోని బీహెచ్ఈఎల్,సింగరేణి సంస్థలను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరగవచ్చునని అన్నారు. కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో ప్రతిపక్షాలు కేటీఆర్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రాలో జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించారని ఆరోపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖలో ఇవే ఆరోపణలు చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేటీఆర్ ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా..? అని ప్రశ్నించారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంట్లో పోరాటానికి టీఆర్ఎస్ ఎంపీలు ముఖం చాటేశారని విమర్శించారు. బీజేపీపై గల్లీలో టీఆర్ఎస్ చెప్పే మాటలకు, ఢిల్లీలో చేతలకు పొంతన లేదని విమర్శించారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications