విశాఖ లా విద్యార్ధినిపై రేప్: పోలీసుల అదుపులో నిందితుడు, ఇతనే (ఫోటోలు)
విశాఖపట్నం: లా విద్యార్ధినిపై అత్యాచారం కేసులో సీనియర్ విద్యార్ధి బీహార్కు చెందిన రిషిబ్ సింగ్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ రిషిబ్ సింగ్ ఎంవీపీలోని దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్నాడన్నారు.
అదే విశ్వవిద్యాలయానికి చెందిన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధినిపై ఈనెల 19న అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. విద్యార్ధిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితున్ని ఎంవీపీ కాలనీలో అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

విశాఖ లా విద్యార్ధినిపై రేప్: రిమాండ్కు తరలించిన పోలీసులు
లా విద్యార్ధినిపై అత్యాచారం కేసులో సీనియర్ విద్యార్ధి బీహార్కు చెందిన రిషిబ్ సింగ్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ రిషిబ్ సింగ్ ఎంవీపీలోని దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్నాడన్నారు.

విశాఖ లా విద్యార్ధినిపై రేప్: రిమాండ్కు తరలించిన పోలీసులు
విశాఖ లా విద్యార్ధినిపై రేప్: రిమాండ్కు తరలించిన పోలీసులు
రిషిబ్ సింగ్ తండ్రి బీహార్ హౌసింగ్ బోర్డులో సూపర్ వైజర్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే న్యాయ విశ్వవిద్యాలయం కూడా రిషిబ్ సింగ్పై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. రిషిబ్ సింగ్ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి తనకు ఏమీ తెలియదని చెప్పాడు. వర్క్ విషయమై వారి గదికి వెళ్లిన క్రమంలో అంతా కలిసి మందు తీసుకున్నామని చెప్పాడు.

విశాఖ లా విద్యార్ధినిపై రేప్: రిమాండ్కు తరలించిన పోలీసులు
అయితే, తాను మాత్రం మద్యం మత్తులో ఉండటం వల్ల ఏం తెలియదని చెప్పాడు. పోలీసు స్టేషన్కు వచ్చేంత వరకు తనకు అసలు ఏం తెలియదని చెప్పాడు. లా యూనివర్శిటీలో చదువుతున్న బీహార్కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంవిపి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

విశాఖ లా విద్యార్ధినిపై రేప్: రిమాండ్కు తరలించిన పోలీసులు
బుధవారం రాత్రి తమ గదిలో ఈ అమ్మాయిలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో ఆ యూనివర్శిటీలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న రిసిబ్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేందుకు వీరి గదికి వచ్చాడు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications