Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటర్లూ మేలుకోండి.. ఐదేళ్ళకోసారే అవకాశం; సముచిత నిర్ణయం తీసుకోండి!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోసం ప్రచార పర్వం కొనసాగి, ఎట్టకేలకు నిన్న సాయంత్రం ముగిసింది. నిన్నటి వరకు ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నం చేయడం రాజకీయ పార్టీల వంతు అయితే, ఇప్పుడు మంచి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడం ఓటర్ల వంతుగా మారింది. ఈ సమయంలో ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి
ఎవరు ఏది చెబితే అది నమ్మకుండా, పోటీ చేసిన వారిలో మంచి నాయకుడు ఎవరు? ఎవరికి ఓటేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది? నిస్వార్ధంగా ఏ ప్రజా ప్రతినిధి తమకు సేవ చేయగలుగుతాడు? వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి. నిన్నటి వరకు సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకు హామీలను గుప్పించారు.

Voters wake up voting chance after five years Take the right decision

ఉచిత పథకాల తాయిలాలను ఓటర్ల ముందు పెట్టిన రాజకీయ పార్టీలు
ప్రతి పార్టీ మేనిఫెస్టో లోని రూపొందించి మేనిఫెస్టోలో ద్వారా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ఊదరగొట్టారు. మేము గెలిస్తే ఈ పథకం తెస్తాం, ఆ పథకం ఇస్తామంటూ ఉచిత పథకాల తాయిలాలను ఓటర్ల ముందు పెట్టారు. మా మేనిఫెస్టో చూసి ఓటెయ్యండి అని ఓటర్లకు విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఓటర్లు గుర్తించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.

తమ సొంత డబ్బులతో పథకాలు ఇవ్వటం లేదు
ఓటర్లకు తాము గెలిస్తే ఈ పథకాలు ఇస్తామని చెబుతున్న నాయకులు ఎవరూ తమ సొంత డబ్బులతో పథకాలను అందించడం లేదు. ప్రజల డబ్బునే మళ్లీ పథకాల రూపంలో అందిస్తున్నారు. మన డబ్బునే మళ్లీ మనకు ఉచితంగా ఇస్తున్న, ఇస్తామని చెబుతున్న రాజకీయనాయకుల విషయంలో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. తమ సంక్షేమం కోసం ఉచితంగా పథకాలు ఇచ్చారు. బ్యాంకులలో డబ్బులు జమ చేశారు.. కాబట్టి వారికి ఓటేద్దాం అన్న ధోరణి మంచిదికాదు.

Voters wake up voting chance after five years Take the right decision

ఉచితాలతో రాష్ట్రం బలహీనం
ఎవరికి ఓటేసి పట్టం కడితే తమ ప్రాంతాన్ని, అలాగే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారు అన్నది ప్రతి ఒక్క ఓటరు అర్థం చేసుకుని, తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఉచిత పథకాలను ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు కాదు. ఉచిత పథకాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా బలహీనమవుతుంది .

మంచి నాయకుడికి ఓటేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్
ఈ విషయాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి నాయకుడికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మంచి నాయకుడికి ఓటేస్తేనే రాష్ట్రానికి, మీకు భవిష్యత్ ఉంటుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+