వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు ఐఎన్ఎస్ యుద్ధనౌక ఇవ్వండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ కాలంపాటు సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్. 30ఏళ్లుగా సేవలందిస్తున్న దీని జీవితకాలం వచ్చే సంవత్సరం(2016)తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఐఎన్ఎస్ విరాట్‌ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు కోరారు.

కాకినాడ వద్ద సముద్రంలో ఈ యుద్ధనౌకను నిలిపి ‘తేలియాడే మ్యూజియం'గా వాడుతూ, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన ప్రతిపాదించారు. విశాఖపట్నం వద్ద సబ్ మెరైన్ మ్యూజియం ఉన్నట్లుగానే, కాకినాడ వద్ద వార్‌షిప్ మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది తమ ఉద్దేశమని, ఐఎన్ఎస్ విరాట్‌ను తమకు అప్పగించాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.

We Want It, Says Chandrababu Naidu About INS Viraat

విరాట్ కన్నా ముందుగా సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను 1997లో తుక్కుగా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో విక్రాంత్‌ను సైతం కాపాడాలని కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఐఎన్ఎస్ విక్రాంత్‌కు పట్టిన గతిని విరాట్‌కు పట్టనివ్వకూడదని భారత నౌకాదళం సైతం భావిస్తుండటంతో.. చంద్రబాబు కోరిక తీరి కాకినాడ తీరం మరో ఆకర్షణీయ ప్రాంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నారు.

English summary
INS Viraat - perhaps the oldest serving warship today and India's second aircraft carrier in the fleet - may live on as a museum after it is decommissioned next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X