పోలవరం పనులతో...చైనా రికార్డు బ్రేక్ చేస్తాం: మంత్రి ఉమ;సిఎం రాక
విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణపరంగా మరో రికార్డు సొంతం చేసుకుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పిల్ ఛానల్, స్పిల్ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో ఒక సరి కొత్త రికార్డు సాధించామన్నారు.
దేశంలోని ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్ పనులు జరగలేదని మంత్రి ఉమ చెప్పారు. చైనా త్రీగోర్జెస్ డ్యామ్లో 24 గంటల్లో 13వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయని, జులై నాటికి తాము చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్వాల్ నిర్మాణం పూర్తైంది. అసాధ్యం అనుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి సుసాధ్యం చేశారు. మొత్తం రెండు సీజన్లలో దీన్ని పూర్తిచేయగలిగారు. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి 412 రోజులు బాగా శ్రమించి రూ.430 కోట్లతో ఈ పనిని పూర్తి చేశారు. సోమవారం ముఖ్యమంత్రి ప్రాజెక్టు హిల్వ్యూ కొండపై ఏర్పాటు చేసిన ఫైలాన్ను ఆవిష్కరించనున్నారు.
ఇదిలా వుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రాక సందర్భంగా ఆయన పర్యటన సాఫీగా సాగేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మావోయిస్టుల బెదిరింపులు,హెచ్చరికల నేపథ్యంలో అధికారులు,రైతులతో సహా అందరినీ తనిఖీ చేసి పాస్ ఇచ్చి లోపలకు పంపుతామన్నారు. ఇప్పటికే పోలవరం పరిసరాల్లో ప్రత్యేక పోలీసులు క్యూంబింగ్ నిర్వహిస్తున్నారని, సీఆర్పీఎఫ్ దళాలు ప్రాజెక్టులో మోహరించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు...
# సోమవారం ఉదయం 10.45గంటలకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు హిల్వ్యూ కొండపై హెలీకాఫ్టర్ నుంచి దిగుతారు.
# మొదట డయా ఫ్రమ్వాల్ నిర్మాణప్రదేశానికి చేరుకుని త్వరితగతిన పనులు పూర్తి చేసిన సాంకేతిక నిపుణులను సత్కరిస్తారు.
# స్పిల్వే నిర్మాణప్రాంతంలో పనులు చూసి స్పిల్ఛానల్లో కొంత మంది రైతులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.
# అక్కడ నుంచి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీర్ల సమావేశంలో పాల్గొంటారు.
# జలవనరుల శాఖాధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు.
# సాయంత్రం 3.30 గంటలకు తిరిగి హెలీకాఫ్టర్లో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications