ప్రతీకారం తీర్చుకొంటాం: జంటహత్యలకు పాల్పడిన వారిని వదలం: గంగుల ప్రభాకర్ రెడ్డి
కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పగలు బుసకొట్టాయి. శిరివెళ్ళ మాజీ ఎంపిపి ఇందూరు ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిదిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.అయితే ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకొంటామని వైసీపీ నేత
కర్నూల్: కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పగలు బుసకొట్టాయి. శిరివెళ్ళ మాజీ ఎంపిపి ఇందూరు ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిదిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.అయితే ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకొంటామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
ఉలిక్కిపడ్డ ఆళ్ళగడ్డ: వైసిపి నేత గంగుల అనుచరుడు సహా ఇద్దరి హత్య
ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పల్లెలు ఇంతకాలంపాటు ప్రశాంతంగా ఉన్నాయి.అయితే ఈ జంట హత్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయితే ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డిని రెండురోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాల వద్ద సిపిఐఎంఎల్ పేరుతో లెటర్ వదిలివెళ్ళారు. తప్పు చేసినవారికి శిక్షతప్పదని ఆ లేఖలో రాశారు.
ప్రశాంతంగా ఉన్న గోవిందుపల్లెలో ఈ జంట హత్యలు కలకలంరేపాయి. ఈ హత్యలకు గల కారణాలను తెలుసుకొనేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ గ్రామాన్ని జిల్లా ఎస్ పి రవికృష్ణ సందర్శించారు.
సంఘటనస్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకొంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో వైపు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మృతదేహాలను ఎమ్మెల్సీ , వైసీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి చూశారు.
అయితే ఈ హత్యలకు కారణాలు ఏమిటో అర్ధం కావడం లేదన్నారు.అంతేకాదు ఈ హత్యలకు కారకులైనవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు గంగుల ప్రభాకర్ రెడ్డి.