'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అంశాలు లేవని, ఇది చాలా దారుణమని వైసిపి నేత పార్థసారథి అన్నారు.
విజయవాడ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అంశాలు లేవని, ఇది చాలా దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి బుధవారం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలుగు ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. ఏపీని పట్టించుకోవాలన్న తమ ఉద్దేశ్యం ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అర్థమైందని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల చెవులలో పూవులు పెట్టారని ఎద్దేవా చేశారు. జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి హోదా ప్రస్తావన లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా పట్టించుకోవాలన్నారు.
విశాఖకు రైల్వే జోన్, అమరావతి కనెక్టివిటీ గురించి ప్రస్తావన లేదని పార్థసారథి అన్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications