బాబు ఎఫెక్ట్: కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఎవరికీ, అదృష్టవంతులు వీరేనా?
అమరావతి:కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపి వైదొలగడంతో ఏపీకి చెందిన బిజెపి ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతోందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది.
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమిగా పోటీ చేశాయి.బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ సమయంలో టిడిపి చేరింది. సుజనా చౌదరి, ఆశోక్ గజపతిరాజులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు చేరారు. కేంద్ర, రాష్ట్రాల్లో టిడిపి, బిజెపి మంత్రులు వైదొలిగారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా కొనసాగారు. కానీ, గత ఏడాది మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో దత్తాత్రేయను మంత్రివర్గంలో చోటు కోల్పోయారు.

కేంద్రమంత్రివర్గంలో ఎంపీలకు చోటు దక్కేనా
కేంద్ర మంత్రివర్గంలో బిజెపి ఎంపీలకు చోటు దక్కుతోందా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం టిడిపి కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగింది. ఏపీ రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలకు కేంద్ర మంత్రివర్గం నుండి చోటు దక్కుతోందా అనే చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున ఏపీ నుండి ప్రాతినిథ్యం కోసం మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

అదృష్టవంతులెవరో
కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అయితే బిజెపి నుండి ఏపీ రాష్ట్రం నుండి ఇద్దరు ఎంపీలున్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ సమయంలోనే హరిబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందనే ప్రచారం సాగింది. అయితే కానీ, ఈ దఫా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో హరిబాబుకు చోటు దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణకు మరోసారి మంత్రి పదవి దక్కేనా
గతంలో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు నుండి బండారు దత్తాత్రేయ ప్రాతినిథ్యం వహించారు. కానీ, పార్టీ అవసరాల రీత్యా దత్తాత్రేయను కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించారు. అయితే ఈ పరిణామం కొంత తెలంగాణ పార్టీ నేతల్లో అసంతృప్తిని గురి చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఎవరికీ దక్కుతోందనే చర్చ ప్రస్తుతం నెలకొంది.

మురళీధర్ రావు, రాం మాధవ్ పేర్లు
కేంద్ర మంత్రివర్గంలోకి బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శులుగా ఉన్న మురళీధర్ రావు, రామ్ మాధవ్ ల పేర్లు కూడ విన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరి పేర్లు కూడ బిజెపి నేతలు పరిశీలించే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ ఉంది. అయితే ఏపీలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హరిబాబుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుందని బిజెపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications