'ప్రభుత్వ చేతగానితనం.. జగన్ అంటే ఉలికిపాటెందుకు?..'
జగన్ అమరావతి వెళ్తున్నారంటే చాలు ప్రభుత్వమెందుకు ఉలిక్కిపడుతోందని పార్థసారథి ప్రశ్నించారు.
హైదరాబాద్: అమరావతి నిర్మాణం విషయంలో రైతులకు అన్యాయం చేశారని తొలినుంచి ఆరోపిస్తోన్న వైసీపీ విమర్శలకు పదును పెడుతోంది. వైసీపీ అధికారి ప్రతినిధి కె.పార్థసారథి తాజాగా దీనిపై స్పందించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ అమరావతి వెళ్తున్నారంటే చాలు ప్రభుత్వమెందుకు ఉలిక్కిపడుతోందని పార్థసారథి ప్రశ్నించారు. రైతులకు అండగా నిలబడేందుకే జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారని అన్నారు.

అమరావతి నిర్మాణంలో టీడీపీ నేతల తీరు గుమ్మడికాయల దొంగల్లా ఉందని.. టీడీపీ నేతలంతా భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే జగన్ మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల నుంచి 33వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం.. వారికి ఇచ్చిన హామిలను మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని తెలిపారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications