మిథున్ రెడ్డి పరామర్శకు జగన్ దూరం, తెర వెనుక..!?
+
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ టార్గెట్ గా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇటు జగన్ సైతం కూటమి ప్రభుత్వం పైన కొత్త వ్యూహాలతో పోరాటం ప్రారంభించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కాగా, పలువురిని పరామర్శించిన జగన్.. మిథున్ రెడ్డి వద్దకు వెళ్లకపోవటం పైన రాజకీయంగా కొత్త చర్చ జరుగుతోంది.
లిక్కర్ కేసులో రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర పైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. కాగా, ఈ నెల 5న రాజమండ్రి జైలులో జగన్ ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శిస్తారని పార్టీ నేతలు చెప్పారు. జగన్ మాత్రం రాజమండ్రి వెళ్లలేదు. డోన్ లో ఆర్దిక మంత్రి బుగ్గన కుమారుడు వివాహ రిసిప్షెన్ కు వెళ్లి అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే, జగన్ రాజమండ్రికి ఎందుకు వెళ్లలేదనేది పార్టీలో చర్చగా మారింది. పలు కేసుల్లో అరెస్ట్ అయిన వైసీపీ నేతలను జైలుకు వెళ్లి పరామర్శించారు. మిథున్ రెడ్డిని జగన్ పరామర్శించకపోవటం వెనుక అనేక కొత్త కారణాలు తెర మీదకు వస్తున్నాయి.

జగన్ ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిని పరామర్శించారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని మాత్రం జగన్ ఇప్పటి వరకు పరామర్శించ లేదు. జగన్ కు నమ్మకంగా పని చేసిన ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరినీ జగన్ ఇప్పటి వరకు పరామర్శించ లేదు. వాస్తవంగా జగన్ ఇప్పటి వరకు పరామర్శించిన నేతలు కంటే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి తొలి నుంచి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అయితే.. జగన్ తొలుత మిథున్ రెడ్డిని కలవాలని భావించినా.. వీరిని ఎవరినీ కలవకుండా నేరుగా మిథున్ రెడ్డిని కలవటం సరి కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని కలవటం పై జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలు లిక్కర్ కేసు అంతా కల్పితం అని చెబుతున్న జగన్ ఆ కేసులో అరెస్ట్ అయిన వారిని కలవటం లో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం పైన ఇప్పుడు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications