'ఆ ఒక్క అబద్దం చెప్పి ఉంటే జగన్ సీఎం అయ్యుండేవారు, నిజాయితీ వల్లే'
కడప: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ ఒక్క అబద్దం చెప్పి ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారని వైసిపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం కడప జిల్లాలో మాట్లాడారు.
రెండేళ్ల క్రితం ఒక్క అబద్ధం చెప్పుంటే జగన్ సీఎం అయ్యుండేవారన్నారు. నిజాయతీగా ఉండటమే ఆయన్ను అధికారానికి దూరం చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని పచ్చి అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక దానిని మరిచారన్నారు.
చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ అన్నందుకే, తమ పార్టీకి దూరమైన కేవలం 5 లక్షల ఓట్లు వైసిపిని అధికారానికి దూరం చేశాయన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైసిపి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు, పార్టీ అధికార గుర్తయిన టేబుల్ ఫ్యాన్ వచ్చిందన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ఏదైనా అంటే చేసి తీరుతారని, వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో వైసిపి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలన్నారు.
ఎన్నికలకు ముందు రైతు రుణ మాఫీ, రాజధాని ప్రాంత రైతులకు రుణాలన్నీ మాఫీ అన్న చంద్రబాబు, ఇప్పుడు మాట మార్చి వారిని మోసం చేశారన్నారు. జగన్ రైతు రుణమాఫీ పైన ఒక్క అబద్దం చెప్పి ఉంటే 175 సీట్లు వైసీపికి వచ్చి ఉండేవన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications