నోట్ల రద్దుపై టిడిపి రివర్స్: 'జగన్ శని వదిలించుకుంటారు, బాబుకు సంబంధం లేదు'
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం విడ్డూరమని మంత్రులు అన్నా
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం విడ్డూరమని మంత్రులు రావెల కిషోర్ బాబు, కామినేని శ్రీనివాస రావు, దేవినేని ఉమామహేశ్వర రావులు అన్నారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని వారు చెప్పారు. అందుకు చంద్రబాబును తప్పుబడుతూ విమర్శలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు పైన కేంద్రం ఎన్నో రోజుల కింద నిర్ణయం తీసుకుంటే ప్రజల ఇబ్బందుల గురించి జగన్కు పదిహేను రోజుల తర్వాత తెలిసిందా అన్నారు.
జగన్ అకస్మాత్తుగా నిద్రలేచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్తులో ప్రజలకు మంచి జరుగుతుందని, కానీ తాను దోచుకున్న లక్షల కోట్లు ఏమవుతాయోనన్న భయంతో జగన్ మాట్లాడుతున్నారన్నారు.
జగన్ రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఈ శనిని వదిలించుకుంటారని చెప్పారు. నేలమాళిగల్లో దాచుకున్న డబ్బును మార్చుకునేందుకే నగదు మార్పిడి గడువును పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని ఆరోపించారు.

నోట్లు రద్దు చేసిన 12 రోజుల తర్వాత బయటకు వచ్చి పొడిగించాలని ఏ ముఖం పెట్టుకుని లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల మార్పిడిపై మాట్లాడే స్థాయి తనది కాదని, వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారథి మాట్లాడాతారని అనడం చూస్తుంటే, ప్రజా సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందో తెలుస్తోందన్నారు.
నగదు రహిత లావాదేవీల కోసం రూపే కార్డులు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే, సెలూన్లలో రూపే కార్డు చూపిస్తే గడ్డం చేస్తారా అని జగన్ హేళన చేయడం ఏమిటన్నారు. జగన్ అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పగించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
మరో మంత్రి కామినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు టీడీపీ ముసుగు వేసుకున్నారని చేసిన వ్యాఖ్యలను జగన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని వేరుగా డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి వెంకయ్య ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
కాగా, నోట్ల రద్దు పైన టిడిపిది ఓ విధంగా రివర్స్ గేర్ అంటున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని మొదటి నుంచి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు, టిడిపి నేతలు కూడా పలుమార్లు చెప్పారని, ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అది తమ నెత్తిన పడకుండా ఉండేందుకు చంద్రబాబుకు ఏం సంబంధమని అడుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications