విభజనపై ససేమీరా: కిరణ్ పార్టీ పెడితే జగన్కు షాకేనా?

మొదట తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని, ఆ తర్వాత సమన్యాయం, అనంతరం సీమాంధ్రలో సమైక్య ఉధృతి చూసి వైయస్ జగన్ సమైక్యవాదం ఎత్తుకున్నారని, అదే కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నారని అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెడితే పుంజుకోవడం ఖాయమని చెబుతున్నారు. జగన్ పార్టీ నుండి కూడా చాలామంది నేతలు వస్తారని కొందరు భావిస్తున్నారట.
శనివారం సిఎల్పీ కార్యాలయంలో ఓ నేత విలేకరులతో ఇష్టాగోష్టీగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారట. జగన్ వైఖరిని తట్టుకోలేని పలువురు నేతలు గత్యంతరం లేకనే ఆ పార్టీలో కొనసాగుతున్నారని, కిరణ్ పార్టీ పెడితే అందులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విభజనకు ఆయన ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనను బుజ్జగించడం నుండి కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. అయినా ఆయన మాత్రం తగ్గడం లేదు. ఇది ఆయన ఇమేజ్ని సీమాంధ్రలో పెంచిందంటున్నారు.












Click it and Unblock the Notifications