తల్లిలేని సమయంలో నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం
హైదరాబాద్: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. పోలీసులు నిందితుడి పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అసద్ అనే ఇరవై ఏళ్ల వ్యక్తి ఓ హోటల్లో వంటవాడిగా పని చేస్తున్నాడు.
ఆ హోటల్ సమీపంలోనే ఏడో తరగతి చదువుతున్న బాలిక ఇల్లు ఉంది. ఆమె రోజు అక్కడి నుండి పాఠశాలకు వెళ్తుంటుంది. ఆ బాలికను అతను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. నాలుగు నెలలుగా ఆమె పైన అత్యాచారం చేస్తున్నాడు.
బాలిక తల్లి పనికి వెళ్లిన సమయంలో నిందితుడు తరుచూ బాలిక ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కూతురు ఆరోగ్యం క్షీణించడంతో బాలిక తల్లి ఆరా తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
సమోసాతో చంపేశారు!
విశాఖ నగరంలో రెండు రోజుల కిందట సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. జగదాంబ జంక్షన్ సమీపంలో జరిగిన ఉన్నీసా(70) హత్యకు సంబంధించిన రెండు జంటలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. స్నేహితులైన నలుగురు బంగారం కోసం ఆశపడి ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సమోసాలో మత్తుమందు కలిపి ఇచ్చి ఈ దారుణానికి తెగబడ్డారు.