కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటోలో ఒంటరిగా వెళ్తున్న వివాహితపై గ్యాంగ్‌రేప్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆటోలో వెళ్తున్న ఒంటరి వివాహితను అడ్డుకున్న ఐదుగురు దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. లగడపాడు గ్రామానికి చెందిన ఓ వివాహిత జూన్ 15న రాత్రి సత్తెనపల్లి నుంచి ఆటోలో తన గ్రామానికి వెళ్తోంది. పెదకూరపాడు గ్రామ శివారులో ద్విచక్రవాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆటోను అటకాయించి ఆమెను పోలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

 A woman allegedly gangraped in Guntur district

ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పెదకూరపాడు ఎస్‌ఐ కొమ్మాలపాటి చంద్రశేఖర్‌ గురువారం తెలిపారు. నిందితులు సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

లారీ-బస్సు ఢీ: పలువురికి గాయాలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఊపరపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A woman allegedly gangraped in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X