ఇద్దరు మహిళలు సజీవ దహనం: ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు (ఫోటోలు)
హైదరాబాద్: బోడుప్పల్లో గుర్తు తెలియని యువతిని దుండగులు హత్యచేసి మృతురాలి ఆనవాళ్లు దొరక్కండా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ టోల్ ప్లాజా సమీపంలోని బలిజగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలోని సర్వీసు రోడ్డు పక్కన ఓ యువతిని అతి కిరాతకంగా పెట్రోలు పోసి తగలబెట్టారు.

సజీవ దహనం: ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
బోడుప్పల్లో గుర్తు తెలియని యువతిని దుండగులు హత్యచేసి మృతురాలి ఆనవాళ్లు దొరక్కండా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటనలో పోలీసులు పురోగతి సాధించారు.

సజీవ దహనం: ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ను పోసి నిప్పంటించి నగర శివారులోని అంబర్పేట్ సమీపంలో ఔటర్ రింగురోడ్డు కీసరగుట్ట వద్ద నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.

సజీవ దహనం: ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
మంగళవారం అదే ప్రాంతంలో పశువులను కాస్తున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సజీవ దహనం: ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సీఏ విద్యార్థిని పూజిత సజీవ దహనం ఘటనను మరువక ముందే హైదరాబాద్ నగరంలో మరో ఇద్దరు మహిళల సజీవ దహనం ఘటనలు చోటుచేసుకున్నాయి.

సజీవ దహనం: ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
ఇక మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైంది. దీంతో అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయుడు శివప్రసాద్ను పట్టుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications