ఒకే కాన్పులో 4గరు ఆడపిల్లలు, బాలుడు అదృశ్యం
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ గర్భిణికి ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు జన్మించారు. తల్లి, బిడ్డలు క్షేమంగానే ఉన్నారు. వేలంగికి చెందిన ఈ మహిళకు తన మొదటి కాన్పులోనే నలుగురు ఆడపిల్లలు జన్మించడంతో అందరూ వింతగా చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే స్వల్ప అస్వస్ధతకు చికిత్స చేయిద్దామని ఆసుపత్రికి తీసుకొచ్చిన చిన్నారి బాలుడు అదృశ్యం కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని ఆదోనిలో చికిత్సకోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన శిశువు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లిందండ్రుల దృష్టి మరల్చిన ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications