మహిళను చంపారు: భర్త రెండో పెళ్లి అంటూ స్త్రీ
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలోనే విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, ఐదు లక్షల రూపాయల కట్నం తెస్తే మళ్లీ ఏలుకుంటానని చెబుతున్నాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఆ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట గ్రామంలో జరిగింది. కరుణశ్రీ అనే మహిళ రామచంద్రాపురంలో ఎంఎస్సీ చదివారు. అప్పట్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్కు చెందిన నక్కా తిరుపతి రాజమండ్రిలో పనిచేస్తూ ఫీల్డ్ వర్క్ కోసం రామచంద్రాపురం వెళ్లేవాడు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2007లో పెళ్లి చేసుకున్నారు.
ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు వెళ్లే తిరుపతి మరో మహిళ వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు కూడా. దీనిపై కరుణశ్రీ నిలదీయగా అదనపు కట్నం తెస్తే ఏలుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.