భర్త అక్రమసంబంధంతో మనస్తాపం: భార్య ఆత్మహత్య

పి. శిరీష అనే 27 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. అయితే, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. బాధితురాలి భర్త అనుపమ్ కుమార్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శిరీష బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
శిరీష్ బంధువులు, కుటుంబ సభ్యులు అనుపమ్పై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. సిఎ అయిన శిరీష ఫౌండ్రీ యజమాని అయిన అనుపమ్ను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వారికి ఎనిమది నెలల కూతురు కూడా ఉంది. శిరీష్ తన ఒంటికి తానే నిప్పంటించుకుందని పోలీసులు చెబుతున్నారు.
ఆమెను రక్షించే ప్రయత్నంలో అనుపమ్ ఒళ్లు కాలిందని అంటున్నారు. తన వైవాహికేతర సంబంధాన్ని ప్రశ్నిస్తే బిడ్డును చంపుతానని అనుపమ్ తనను బెదిరిస్తూ వచ్చాడని శిరీష్ తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. వేరే మహిళతో అనుపమ్ సంబంధం పెట్టుకోవడంతో ఇరువురి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications