వద్దు నాన్నా అన్నా కనికరించలేదు, ఓ తండ్రి ఇలా చేస్తాడనుకోలేదు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మోమిన్ పేట మండలం చిట్టెంపల్లి తండాకు చెందిన గిరిజన బాలిక పైన అత్యాచారం, హత్య కేసులో పోలీసులు తండ్రినే నిందితుడిగా తేల్చారు. తాగిన మైకంలో తన కూతురు పైన అత్యాచారానికి పాల్పడినట్లు తండ్రి కమాల్ అంగీకరించాడు.
తాను చేసిన తప్పు భార్యకు, ఊరిలోని వారికి చెబితే పరువు పోతుందే గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. వద్దు నాన్నా అన్నా ఆ తండ్రి కనికరించలేదు.
ఈ ఘటన పైన రంగారెడ్డి జిల్లా ఏఎస్పీ చందనా దీప్తీ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదన్నారు. తండ్రి కమల్ చర్యలను చూస్తుంటే మొదటి నుండి తమకు అతని పైనే అనుమానం కలిగిందన్నారు. అతను మృగంలా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు, అమ్మాయిలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలన్నారు. ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించామని, అయితే ముందు నుండి అతని పైనే అనుమానం ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.
నిందితుడికి కుటుంబ సభ్యుల అండ
బాలిక హత్య కేసులో తండ్రి కమాల్ను పోలీసులు నేరస్తుడిగా తేల్చడంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. అతను అలాంటి వాడు కాదని, పోలీసులు కొట్టి అతడితో నేరం ఒప్పించి ఉంటారని అతని తల్లి, అత్త ఆరోపిస్తున్నారు. భార్య మాట్లాడే పరిస్థితుల్లో లేదని తెలుస్తోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications