అమరావతి అప్పు రీ పేమెంట్ పై ప్రపంచ బ్యాంకు క్లారిటీ..!!
ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు అయింది. ఈ రుణం గురించి కేంద్ర బడ్జెట్ వేళ ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు పైన చర్చ జరిగింది. అనేక సంప్రదింపుల తరువాత ప్రపంచ బ్యాంకు టీం అమరావతిలో పర్యటించింది. సీఆర్డీఏ అధికారులతో తుది చర్చల అనంతరం అమరావతికి 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. ఇప్పుడు ఈ రుణం చెల్లింపు, షెడ్యూల్ ఖరారు చేస్తూ సీఆర్డీఏకు లేఖ రాసింది.
ప్రపంచ బ్యాంకు లేఖ
అమరావతి రుణం పైన తాజాగా ప్రపంచ బ్యాంకు సీఆర్డీఏకు లేఖ రాసింది. అందులో తాము ఇస్తున్న రుణం వివరాలను వెల్లడించింది. దీంతో పాటుగా ఈ రుణం చెల్లించాల్సిన గడువు పైన స్పష్టత ఇచ్చింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ కింద 800 అమె రికన్ మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు మంజూరు చేసింది. ఈ రుణం మంజూరు వేళ అనేక కండీషన్లను ప్రపంచ బ్యాంకు ప్రస్తావించింది. ఆరు విడతల్లో రుణం విడుదల చేసేలా తమ నిర్ణయం వెల్లడించింది. ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రణాళి కలో పేర్కొన్న విధంగా పనులు పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు మంజూరు చేయనుంది.

రీ పేమెంట్ షెడ్యూల్
అమరావతి పనులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలన చేయనున్నారు. తాము ఇస్తున్న రుణాన్ని ఆరు సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో 29 ఏళ్లలో చెల్లించాలని ప్రపంచబ్యాంకు లేఖలో స్పష్టం చేసింది. సిఆర్డిఎకు ప్రపంచబ్యాంకు రుణం మంజూరు.. షరతులు, తిరిగి చెల్లింపు షెడ్యూల్ ను వివరిస్తూ లేఖ రాసింది. అమరావతి కి ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణం ఎవరు చెల్లించాలి.. ఎంత కాలంలో తిరిగి చెల్లింపులు చేయాలనే దాని పైన కొంత కాలంగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు తాజా లేఖతో దీనిపై స్పష్టత వచ్చింది. సంస్థాగత అభివృద్ధి కోసం ప్రపంచబ్యాంకు ఈ రుణం ఇస్తున్నట్లు పేర్కొంది.
లేఖలో క్లారిటీ
అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పన..సంస్థల ఏర్పాటు..ఉద్యోగాలు, ఉపాధి కల్పనను పెంచేందుకు సిఆర్డిఎ ఇచ్చిన సూచనలను బ్యాంకు డైరెక్టర్లు ఆమోదించినట్లు లేఖలో వివరించారు. ఇందు కోసం ప్రైవేటు రంగాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా సకాలంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించాలని స్పష్టం చేసారు. దీనిపై వచ్చే గ్రీవెన్స్ను తనిఖీ చేస్తూ ఉంటామ ని పేర్కొన్నారు. ఐదేళ్లలో రాజధానికి రూపురేఖలు తీసుకువస్తే ప్రైవేటు కంపెనీలు, సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉపాధి పెరుగుతుందని ప్రభుత్వం చర్చల్లో భాగంగా ప్రపంచ బ్యాంకుకు వివరించింది.పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో, ఇప్పుడు ఈ లేఖ ద్వారా ప్రపంచ బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు పైన దాదాపు స్పష్టత వచ్చింది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications