వైసిపి అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడ : మేనిఫెస్టోలో అమరావతి పై : వైసిపి స్పష్టీకరణ..!
వైసిపి అధికారంలోకి వస్తే ఏపి రాజధాని ఎక్కడ. అమరావతి రాజధానిగా ఉండదా. జరుగుతున్న ప్రచారానికి వైసిపి ఇస్తున్న సమాధానం ఏంటి. ఎన్నికల సమయంలో వైసిపి ఓ కీలక ప్రకటన చేసింది. ఏపి రాజధాని విషయంలో తమ మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వనున్నారు. ఏం చెప్పబోతున్నారు..
అమరావతే రాజధానిగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుంది.. అని పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దీనిని పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో కూడా పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తమ పార్టీకి నష్టం కలిగించేలా.. ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.

మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలనే తాము స్ఫూర్తిగా తీసుకుంటు న్నామని, వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధితో అమలుచేసేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నామ న్నారు. జగన్ రాజధానిగా అమరావతి ని మారుస్తారని..దొనకొండ లో రాజధాని ఏర్పాటు చేస్తారంటూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తిప్పి కొట్టాలని వైసిపి నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎన్నికల ముందే ఈ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.
పాదయాత్ర అనుభవాలతో..
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో అనేక వర్గాల సమస్యలు, భౌగోళిక పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారని.. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుప రుస్తామని ఉమ్మారెడ్డి స్పష్టం చేసారు. అయితే, జగన్ తన పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గానికి మేనిఫెస్టో ప్రకటిస్తా మని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోల మూడు లేదా నాలుగు పేజీలు మాత్రమే ఉంటుందని చాలా సభ ల్లో చెప్పుకొచ్చారు. నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ వైసిపి మేనిఫెస్టో కమిటీ తమ ప్రణాళికను సిద్దం చేస్తోంది.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications