వైసీపీ నేత కేతిరెడ్డి సంచలన నిర్ణయం, ధర్మవరంలో ఇక..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కావటంతో మాజీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాల పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఈ నెలాఖరు నుంచి వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు తిరిగి యాక్టివ్ అవుతు న్నారు. అందులో భాగంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు.
రాయలసీమ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు ధర్మవరం లోనూ తిరిగి రాజకీయంగా వైసీపీ యాక్టివ్ అయ్యే కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2009 లో కాంగ్రెస్ నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి 2014లో ఓడిపోయారు. తిరిగి 2019 లో వైసీపీ నుంచి మరో సారి విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కొత్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఎన్నికల సమయం వరకు కొనసాగించిన కేతిరెడ్డికి.. ఈ ప్రోగ్రాం మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. దీంతో, తిరిగి కేతిరెడ్డి విజయం ఖాయమనే చర్చ జరిగింది. అయితే.. 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోయారు.
కూటమి అభ్యర్ధిగా బీజేపీ నుంచి పోటీ చేసిన సత్యకుమార్ విజయం సాధించారు.కేవలం 3,734 ఓట్లతో కేతిరెడ్డి ఓడిపోపోయారు. గెలిచిన సత్యకుమారం మంత్రి అయ్యారు. కాగా..ఎన్నికల ఫలి తాల తరువాత కేతిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనానికి కారణమయ్యాయి. నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయం లో కొందరు అధికారుల తీరు.. నేతలు వ్యవహార శైలి పైన ఓపెన్ గానే వ్యాఖ్యలు చేసారు.
కాగా.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. జగన్ కు విధేయుడగా ఉండే కేతిరెడ్డి వచ్చే ఎన్నికల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇమేజ్ తెచ్చిన గుడ్ మార్నింగ్ ధర్మవరం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసారు. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు ఏమీ చేయలేదని సత్యకుమార్ పై విమర్శలు చేసిన కేతిరెడ్డి.. తాను ప్రజలలో ఉంటాను అని వారికి అండగా ఉంటాను అని వెల్లడించారు. దీంతో.. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications