Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ నేత కేతిరెడ్డి సంచలన నిర్ణయం, ధర్మవరంలో ఇక..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కావటంతో మాజీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాల పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఈ నెలాఖరు నుంచి వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు తిరిగి యాక్టివ్ అవుతు న్నారు. అందులో భాగంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు.

రాయలసీమ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు ధర్మవరం లోనూ తిరిగి రాజకీయంగా వైసీపీ యాక్టివ్ అయ్యే కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2009 లో కాంగ్రెస్ నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి 2014లో ఓడిపోయారు. తిరిగి 2019 లో వైసీపీ నుంచి మరో సారి విజయం సాధించారు.

YCP Leader Ketireddy Venktarami Reddy sesnsational decision in Dharmavaram

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కొత్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఎన్నికల సమయం వరకు కొనసాగించిన కేతిరెడ్డికి.. ఈ ప్రోగ్రాం మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. దీంతో, తిరిగి కేతిరెడ్డి విజయం ఖాయమనే చర్చ జరిగింది. అయితే.. 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోయారు.

కూటమి అభ్యర్ధిగా బీజేపీ నుంచి పోటీ చేసిన సత్యకుమార్ విజయం సాధించారు.కేవలం 3,734 ఓట్లతో కేతిరెడ్డి ఓడిపోపోయారు. గెలిచిన సత్యకుమారం మంత్రి అయ్యారు. కాగా..ఎన్నికల ఫలి తాల తరువాత కేతిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనానికి కారణమయ్యాయి. నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయం లో కొందరు అధికారుల తీరు.. నేతలు వ్యవహార శైలి పైన ఓపెన్ గానే వ్యాఖ్యలు చేసారు.

కాగా.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. జగన్ కు విధేయుడగా ఉండే కేతిరెడ్డి వచ్చే ఎన్నికల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇమేజ్ తెచ్చిన గుడ్ మార్నింగ్ ధర్మవరం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసారు. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు ఏమీ చేయలేదని సత్యకుమార్ పై విమర్శలు చేసిన కేతిరెడ్డి.. తాను ప్రజలలో ఉంటాను అని వారికి అండగా ఉంటాను అని వెల్లడించారు. దీంతో.. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+