రాజీనామా చేస్తా: జగన్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి హెచ్చరిక
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు నిలిపేయకపోతే తాను శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి చెప్పారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని ఆమె సోమవారం సందర్శించారు. తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ఆమె చెప్పారు.
తనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నాయకులు గానీ పోటీ చేయవచ్చునని ఆమె అన్నారు. బాక్సైట్ మైనింగ్ ఎజెండాగా జరిగే ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే చందర్బాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వం బాక్సైట్ గనుల జోలికి రాకపోవడం మంచిదని ఈశ్వరి సూచించారు. ఈ పర్యటనలోో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై విశాఖపట్నం జిల్లాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో అఖిల పక్షం తరఫున బంద్ కూడా జరిగింది. బాక్సైట్ తవ్వకాలను నిలిపేయకపోతే తమ పార్టీకి రాజీనామా చేస్తామని టిడిపికి చెందిన మణికుమారి, ఇతర నాయకులు కూడా ప్రకటించారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications