రోజా సంచలనం:త్వరలో వైఎస్ఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు
చిత్తూరు:వైసిపి ఎమ్మెల్యే రోజా మరో సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
వాటిని తాను సొంతంగా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రోజా చెప్పారు. సోమవారం నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దీంతో ప్రజల కోసం సహాయ కార్యక్రమాలను తానే సొంతగా చేపడుతున్నానన్నారు.

నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్ కాలేజీలో ఆర్వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశామని...10 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందచేశానని ఆమె చెప్పారు. ఆకలితో బాధపడే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే దృక్పథంతో త్వరలో వైఎస్ఆర్ అన్న క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ది పరంగా నగరి నియోజకవర్గం రూపురేఖలు మారుతాయని ఆమె హామీ ఇచ్చారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications