విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ
వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.తాను క్రియశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమవుతున్నట్లు ఆయనప్రకటించారు.రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే..తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్లో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు.
"Even though we do not approve your decision, we still respect your choice. You’ve been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your… https://t.co/NCoaEYxCEq
— YSR Congress Party (@YSRCParty) January 25, 2025
శనివారం ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉప రాష్ట్రపతి విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి.జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇంత సడన్గా ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇటీవలే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు.ఇలాంటి సమయంలో ఆయన జగన్కు తోడుగా ఉండాల్సిబోయి, ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి.

తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధికారికంగా స్పందించింది. "మీ నిర్ణయాన్ని మేము ఆమోదించకపోయినా, మీ ఎంపికను మేము ఇప్పటికీ గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుండి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము.వ్యవసాయ రంగంలో మీ అభిరుచిని కొనసాగించడానికి రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. మీ సహకారాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము'' అని వైసీపీ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications