చంద్రబాబు గురించి ప్రధాని మోదీ ఇలా మాట మార్చారేంటీ ..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం ఏపీలో పర్యటించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలో అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. బీజేపీ హయాంలో భారత్కు ప్రపంచంలో ఖ్యాతి పెరిగిందని తెలిపారు. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ తొలిసారి ఏపీ సీఎం జగన్పై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే..ఏపీలో వైసీపీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు అభివృద్ధికి మారుపేరని ప్రధాని మోదీ పొగిడారు. అయితే దీనిపై వైసీపీ కౌంటరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అభివృద్ది మంచిగా జరిగిందని మోదీ వ్యాఖ్యానించారని..ఇదే మోదీ 2019 ఎన్నికల ముందు చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేశారో వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అని..అయితే ఆయన మంచి చేయడంలో సీనియర్ కాదని..అవినీతి, స్కాంలు చేయడంలో సీనియర్ అని గతంలో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలను వైసీపీ నాయకులు గుర్తుకు తెస్తున్నారు.
పోలవరంను ఏటీఎంలా వాడుకుంది చంద్రబాబేనని గత ఎన్నికల్లో మోదీ ఘోరంగా విమర్శించారని..ఇప్పుడు ఆయన అభివృద్ధికి మారుపేరు ఎలా అయ్యారో చెప్పాలని ప్రధానిని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదే సమయంలో ల్యాండ్ యాక్టింగ్ చట్టం గురించి కూడా వైపీపీ నాయకులు ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. అసలు ల్యాండ్ యాక్టింగ్ చట్టాన్ని తీసుకువచ్చిందే బీజేపీ ప్రభుత్వమని..దానిపై కూటమి నేతలు విమర్శలు చేస్తోన్న మోదీ స్పందించకపోవడం దారుమని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇక రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముస్లిం రిజరేషన్ల గురించి ప్రస్తావించిన మోదీ ఏపీలో ఎందుకు ఆ సాహసం చేయలేకపోయరని ప్రశ్నిస్తున్నారు. వారికి ఓట్లు , సీట్లు కావాలి తప్పిస్తే.. ప్రజల సంక్షేమం అవసరం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటు వేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరుగుతుందో ఆలోచించి ఓట్లు వేయాలని ప్రజలకు వైసీపీ నేతలు విజ్క్షప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications