Year Ender 2022 : ఈ ఏడాదీ పట్టాలెక్కని 3 రాజధానులు-హైకోర్టు తీర్పు దెబ్బ-సుప్రీంలో పోరాటం !
ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాజధానిగా ఉన్న అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ .. మూడేళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ వాటిని పట్టాలెక్కించలేకపోయింది. అంతే కాదు మూడేళ్లు గడుస్తున్నా ప్రజల్లో తమకు మూడు రాజధానులే కావాలనే బలమైన భావనను తీసుకురాలేకపోయింది. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు పేరుతో లీకులిస్తూ కాలం గడిపేయాల్సిన పరిస్ధితి.

వైసీపీ మూడు రాజధానులు
ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ 2019 డిసెంబర్ లో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల ఫార్ములాను సమర్ధించుకునేందుకు బోస్టన్ గ్రూప్, జీఎస్ రావు కమిటీ నివేదికల్ని తయారు చేయించారు. అసెంబ్లీలో మూడు రాజధానుల కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి రద్దుకే సిద్ధమయ్యారు. చివరికి గవర్నర్ తో ఎలాగోలా ఆమోద ముద్ర వేయించారు. కానీ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా బూమరాంగ్ అయిపోయింది. చివరికి ఇప్పటికీ మూడు రాజధానులు అమల్లోకి వస్తాయా రావా అంటే కచ్చితమైన సమాధానం ఎవరి వద్దా లేదు.

అమరావతిని సమర్ధించిన హైకోర్టు
వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన రైతులు, విపక్షాలు.. హైకోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్తా న్యాయ వివాదంగా మారిపోయింది. చివరికి విచారణ జరిపిన హైకోర్టు.. అమరావతిని ఆరునెలల్లో పూర్తి చేయాలని, రైతులకు పరిహారం కూడా ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది మార్చిలో వెలువడిన హైకోర్టు తీర్పుపై సెప్టెంబర్ వరకూ మౌనంగా ఉండిపోయిన జగన్ సర్కార్.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ఏడాది హైకోర్టు తీర్పు తర్వాత ఈ న్యాయపోరాటం కాస్తా సుప్రీంకోర్టుకు చేరినట్లయింది.

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి రాజధానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా...రైతులు కూడా ఈ తీర్పును పూర్తిగా అమలుచేయాలంటూ సుప్రీం గడప తొక్కారు. దీంతో విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు అమరావతి నిర్మాణం కోసం పెట్టిన గడువుల్ని తోసిపుచ్చింది. దీంతో ఈ విషయంలో వైసీపీ సర్కార్ కు తొలి ఊరట లభించింది. మిగతా అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఇదే ఊపులో సుప్రీంకోర్టు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు చెప్పుకుంటూ రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అమరావతి పాదయాత్ర వర్సెస్ వికేంద్రీకరణ సభలు
ఈ మధ్యలోనే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులు అరసవిల్లికి పాదయాత్ర ప్రారంభించారు. మూడు జిల్లాల్లో బాగానే కొనసాగిన ఈ యాత్రకు తూర్పు గోదావరికి వచ్చే సరికి ఆటంకాలు మొదలయ్యాయి. పోలీసులు కూడా ఆంక్షల పేరుతో అడ్డుకోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా పూర్తిగా ఊరట దొరక్కపోవడంతో పాదయాత్ర పూర్తిగా నిలిచిపోయింది. అదే సమయంలో పాదయాత్రకు కౌంటర్ గా వైసీపీ సర్కార్ ప్రాంతాల వారీగా వికేంద్రీకరణ సభలు నిర్వహించడం మొదలుపెట్టింది. పాదయాత్ర నిలిచిపోయినా వికేంద్రీకరణ సభలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో అమరావతి రైతులు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో నిరసనలు తెలిపేందుకు తరలివెళ్లారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications