Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: కరెంట్ బిల్ కట్టక్కరలేదు.. మీకే ఎదురు డబ్బులు!

దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు మేలు చేసే అనేక విశేషమైన పథకాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎన్నో కేంద్ర పథకాలు ఉన్నప్పటికీ, ఆ కేంద్ర పథకాల ప్రయోజనం చాలామందికి తెలియడంలేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వెన్నుదన్నుగా ఉంటున్న పథకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పథకాలలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ఒకటి.

పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం మన ఇళ్ళల్లో సౌర విద్యుత్ వెలుగులను అందించడమే కాకుండా, మనకు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతినెల పెరుగుతున్న కరెంటు బిల్లుల భారంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మధ్యతరగతి కుటుంబాల పైన కరెంటు బిల్లుల భారం పడకుండా ఉండటం కోసం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

you could get money back without having to pay your current bill with pm suryaghar scheme

Take a Poll

ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా ప్లాన్
ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఇంటి పైన రెండు కిలోవాట్ల సౌర విద్యుత్ పానెల్ ను ఏర్పాటు చేస్తే నెలకు 200 నుంచి 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇంతకంటే తక్కువగా మన విద్యుత్ వినియోగం ఉంటే ఆ మిగులు విద్యుత్ ను డిస్కంలు తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.

25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ పథకం ద్వారా ఇళ్లపైన సౌర విద్యుత్తు ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు పొందవచ్చని, అలాగే ఈ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తుందని చెబుతున్నారు.నెట్ మీటరింగ్ విధానం ద్వారా వినియోగదారులు ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు మించి వాడిన బిల్లుల భారం పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు.

డిస్కంలు యూనిట్ కు 2 రూపాయల 9 పైసల చొప్పున కొనుగోలు
ఈ సౌర విద్యుత్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తు మిగులు ఉంటే, డిస్కంలు యూనిట్ కు 2 రూపాయల 9 పైసల చొప్పున కొనుగోలు చేస్తాయని ఇది మంచి ఆదాయం మార్గమని అధికారులు చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య, వ్యవసాయ పరిశ్రమలు కలిపి సుమారు 2.2 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని 1.56 కోట్ల గృహ కనెక్షన్లు ఉన్నాయని చెప్తున్నారు.

పీఎం సూర్యఘర్ రాయితీ ఇలా
పీఎం సూర్య ఘర్ కింద 20 లక్షల ఇళ్ల పైన రెండు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. దీని ద్వారా 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఒక అంచనా. ఇక రెండు కిలోమీటర్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం 60 వేల రూపాయల రాయితీ ఇస్తుండగా, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 ఇస్తూ వీటి ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+