'బాహుబలి-2' సీడీ కావాలా నాయనా? కేవలం రూ. 30 మాత్రమే!
సంచలన విజయం సాధించిన'బాహుబలి-2' సినిమా పైరసీ కోరల్లో చిక్కుకుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ సినిమా సీడీలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఒక్కో సీడీని కేవలం రూ. 30కే అమ్మేస్తున్నారు.
విజయవాడ: 'కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం, ఏళ్ల పాటు కష్టించి సినిమాను నిర్మించాం... దయచేసి ఈ సినిమాను పైరసీ చేయకండి', అంటూ దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంతగానో వేడుకున్నా పైరసీ కేటుగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు.
తాజాగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి-2' సినిమా కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ సినిమాకు సంబంధించిన సీడీలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి.

పలు సీడీ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది చేసిన దాడుల్లో భారీ సంఖ్యలో ఈ సినిమా పైరసీ సీడీలు బయటపడ్డాయి. ఒక్కో సీడీని కేవలం రూ. 30కే అమ్మేస్తున్నారు ఆయా దుకాణాల నిర్వాహకులు.
ఈ సీడీలన్నీ చెన్నై నుంచి వస్తున్నాయని షాపు యజమానులు తెలిపారు. తాము పైరసీ సీడీలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నామని, ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఈ పైరసీ భూతం ఆట కట్టించలేమని టాస్క్ ఫోర్స్ అధికారులు అంటున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications