పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..!
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మరోసారి రాజకీయ మాటల యుద్దం సాగుతోంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాజాగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆయనకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (pemmasani Chandrasekhar) చేసిన విమర్శలపై చర్చ జరుగుతోంది. దీంతో పెమ్మసాని వ్యాఖ్యల్ని తప్పుబడుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు (ambati Rambabu)ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ మాటల యుద్దం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
చంద్రబాబును ఉద్దేశించి జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో కౌంటర్ ఇచ్చారు. ఆయన్ని ఒక్క మాటతో చంపేయగలం, కానీ మాకు సంస్కారం ఉంది అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. విలువలు, పెరిగిన పద్ధతి తమను అడ్డుకుంటున్నాయన్నారు. దమ్ముంటే తమను రాజకీయంగా ఎదుర్కోవాలంటూ పెమ్మసాని జగన్ కు సవాలు విసిరారు. చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ వల్ల తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.

మాటతోనే చంపే రౌడీవ పెమ్మసాని!
— Ambati Rambabu (@AmbatiRambabu) March 27, 2026
వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త!
గుంటూరు : జగన్పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..!
— Yash (@YashTDP_) March 26, 2026
జగన్ తీరుపై మండిపడ్డ పెమ్మసాని చంద్రశేఖర్.. సంస్కారం ఉందనే ఆగుతున్నామని, హద్దు దాటొద్దని జగన్కు స్ట్రాంగ్ వార్నింగ్..!
చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు..
బాడీ షేమింగ్ గురించి… pic.twitter.com/OLe1QL1TlK
దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని! అంటూ ట్వీట్ లో అంబటి ఆయన్ను ప్రశ్నించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త! అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ ను అంబటి హెచ్చరించారు. దీంతో టీడీపీ-వైసీపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం పరాకాష్టకు చేరినట్లయింది. గతంలో అంబటి అరెస్టు సందర్భంగా కూడా పెమ్మసాని.. వైసీపీ నాయకులకు సినిమా చూపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications